Saturday, May 23, 2009

విశ్వం పరిధి - కాలం నిడివి

"న కాంక్షేవిజయం కృష్ణ నచ రాజయం సుఖావిచ
కిం నోరాజ్యేన గోవింద భోగైర్జీవితేనవా"

యుద్ధ రంగంలో తనకు తారసపడిన బంధువులను, మిత్రులను, తాతలను, తండ్రులను, మనుషులను, మామలను,
గురువులను చంపుటకు ఇష్టపడని అర్జునుడు విషాదానికి గురై నాకు విజయం వలదు, రాజ్యం వలదు సుఖములపై,
భోగములపై ఎంతమాత్రం వ్యామోహం లేదనుచు ధనుర్భానములను క్రిందవేసిన అర్జునుడికి జ్ఞానమును ప్రసాదించే
క్రమంలో శ్రీ కృష్ణుడు పడిన పాట్లెన్నో ?


అర్జున విషాద యోగంతో మొదలై మోక్ష సన్యాస యోగముతో ముగిసిన భగవద్గీత 18 అధ్యాయాలలోని 700 శ్లోకాల
ఉద్దేశం అర్జునునికి జ్ఞానమును కలిగించటానికే, అయితే 11 అధ్యాయం "విశ్వరూప సందర్షన యోగం" యొక్క
ప్రభావం అర్జునునిపై కాస్తా ఎక్కువేనని చెప్పవచ్చును.


"సంకుచితత్వం సమసిపొవాలంటే అంతరిక్షాన్ని అవలోకించు
అనంత విశ్వంలో నీ అస్తిత్వం ఎంత సూక్ష్మమో అవగతమయ్యేకొద్ది
నీ అంతరంగం అంత విస్తృతము అవుతుంది" ____ ఒక తత్వవేత్త.

ఇల్లు, ఇల్లాలు, పిల్లలు,భూములు,ప్లాట్లు, ఆస్తులు, బ్యాంకు బ్యాలన్సులు అనేక సుఖాలను చవిచూపే దేహం,
ఆత్మీయతల్ని పంచుతూ తన చుట్టు ఇతర కొన్ని దేహాలు, ఆది అంతములు కనిపించక నిత్యం ప్రవాహంలా సాగిపోయే
కాలంలో నీ చరిత్ర ఎక్కడ ప్రారంభమైనది, ఎక్కడ ముగియనున్నది? అంచులంటూ కనిపించని విశాల విశ్వంలో ఎక్కడ
స్థిరపడి ఉన్నావు? ఎప్పుడు కనుమరుగు అవుతావు? సమాధానం లభించని ప్రశ్నలను ఒక్కసారి కూడా

స్పృశించుకోని మానవుడు చీకటిలో బతుకుతు,చీకటిని పీలుస్తు, చీకటిని తింటూ వంటి నిండా చీకటిని
పులుముకుంటూ ఆనందిస్తున్నాడు.


భూమికి 15 కోట్ల కి.మీ. దూరంలో ఉన్న సూర్యుని నుండి ఉదయం తెల్లవారగానే సెకనుకు 3 లక్షల కి.మీ వేగంతో
బయలుదేరిన సూర్యకిరణం 8 ని. 20 సెకన్లలో భూమికి చేరుతుంది. ఎంతో విశాలమైనదిగా భవించే మన భూమి
కంటే 13 లక్షల రెట్లు ఎక్కువ ఘనపరిమాణం కలిగిన సూర్యుడు తన చుట్టూ నియమిత కక్ష్యలలో తిరిగే 9 గ్రహాలను
కలిగి సౌరకుటుంబంగా పిలువబడుతున్నాడు. ఇలాంటి సౌరకుటుంబాలు 3 వేల కోట్లు కలిస్తే ఏర్పడే మందలాన్ని
"నిబ్యులా" అని, ఇలాంటి నెబ్యులాలు కొన్ని కోట్లు కలిస్తే ఏర్పడేదే గెలాక్సీ లేదా దుగ్దపథం లేదా పాల పుంతగా
పిలువబడుతుంది.


మన సౌరకుటుంబం స్థిరపడి యున్న పాల పుంతను " ఆకాశ గంగ" గా వ్యవహరించుకుంటున్నాము. 1500 కోట్ల
సూర్యుడి లాంటి నక్షత్రాలను కలిగి యున్న పాల పుంత వ్యాసం ఒక లక్ష కాంతి సంవత్సరాలు. భూమి మాదిరిగానే
సూర్యుడు కూడా తన చుట్టు తాను తిరుగుతూ పాల పుంత చుట్టూ తిరుగుతాడు. అందుకు పట్టేకాలం 24 కోట్ల
సంవత్సరాలు.


విశాల విశ్వంలో మన సౌర కుటుంబంలోని సూర్యుడు కాక భూమి కి అతి సమీపంగా ఉండే నక్షత్ర దూరం 4.28 కాంతి
సంవత్సరాలైతే, అతి దూరంగా ఉండే నక్షత్రం దూరం 100 కోట్ల కాంతి సంవత్సరాలు __ విశ్వం పరిధి ఇదైతే కాలం
నిడివిని ఒకసారి తడిమి చూసుకుందాం.


ఋగ్వేదం ప్రకారం కృత యుగం (17,28,000 సం.లు) త్రేతా యుగం (12,96,000 సం.రాలు) ద్వాపర యుగం
(8,64,000 సం.రాలు) , కలియుగం (4,32,000 సం.రాలు) లను కలిపి చతుర్యుగంగా పేర్కోంటాం. మొత్తం
చతుర్యుగం కాలం 43,20,000 సం..రాలు. ఇలాంటి 71 చతుర్యుగములు కలిస్తే ఏర్పడేదే ఒక మన్వంతరం. ఇప్పటికి 6
మున్వంతరరాలు గడిచినవి. (స్వాయంభవుడు, స్వారోచిషుడు, ఔత్తమి, తామసుడు, రైవతుడు, చాక్షసుడు ఆరుగురు
మనువుల పేర్లివి). ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరమైన దైవస్వతములోని 28 చతుర్యుగములో ఉన్నాము.


విధంగా సంకుచితత్వంలో మ్రగ్గిపోయే ప్రతి మనిషి తన మటుకు తాను విశ్వరూప సందర్షన యోగాన్ని ప్రాప్తింప
చేసుకొని తనలోని సంకుచితత్వాన్ని పటాపంచలు చేసుకుంటాడని ఆశిద్దాం !

No comments:

Post a Comment